పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 25వ చిత్రం 'అజ్ఞాతవాసి'... రేపు భారీ క్రేజ్ నడుమ అట్టహాసంగా రిలీజ్ కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు. ఇద్దరు హీరోయిన్లలో ఒకరైన అను ఇమ్మాన్యుయేల్ కు ఇదే మొదటి అతిపెద్ద చిత్రం కావడంతో దీనిపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నారామె. ఈ చిత్రం గనుక ఘన విజయాన్ని అందుకుంటే ఆమె స్టార్ హీరోయిన్ల జాబితాలోకి వెళ్లిపోవడం ఖాయం.

ఇక తన కో స్టార్ పవన్ గురించి మాట్లాడిన ఆమె ఆయనొక ప్రత్యేక వ్యక్తి అని, ఎంతో క్రేజ్ ఉన్నా చాలా సాధారణంగా ఉంటారని, షూట్ లేకపోతె స్టేట్స్ లో రిలాక్స్డ్ గా ఉంటారని, ఆయనకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువని, ఆయనతో వర్క్ చేయడం చాలా బాగుందని అన్నారు. ఈమెతో పాటు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ఈ చిత్రంలో నటించారు.
ఈ సినిమాకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటుచేయనున్నారు. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శక, నిర్మాతలు స్పష్టంచేశారు. శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను చిత్ర నిర్మాత చినబాబు, దర్శకుడు త్రివిక్రమ్ కలిశారు. ‘అజ్ఞాతవాసి’ సినిమా చూసేందుకు రావాలని ఆయనను ఆహ్వానించారు.